మా అన్నగారు వీర నరసింహ రాజు గారు వ్రాసిన ఒక లేఖపై - "కులంలేని మతం మరియు ప్రహరీలేని గృహం రెండూ ఒకటే, రక్షణ కరువై నేలకూలతాయి" అనే నా వ్యాఖ్యకు వచ్చిన రెండు ప్రతికూలవ్యాఖ్యలు. వాటికి స్పందన అక్కడ ఇచ్చేకంటే ఇక్కడ ఇస్తే బాగుంటుందన్న ఉద్ధేశ్యంతో...
నేను ఇప్పటిదాకా మెదడు మోకాలులోకి పోయినవారిని అతి సమీపంగా చూశాను, అయితే మెదడు అరికాలులోకి జారిన ఘటాలను చూడడం ఇదే మొదలు!
ఏ కులపురాణం, జాతిపురాణం, పురాణగాథలు, ఇతిహాసాలు చూసినా కులం/జాతి/వంశం అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తూ రావడం కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మనం కంటితో చూసింది, చెవులతో విన్నది మన మెదడులో చైతన్యాన్ని నింపడానికి మారుగా జడత్వాన్ని ప్రబలంగా పెంచుతోంది.
కులం & మతం అనేవి నాణేనికి రెండు ప్రక్కలుకాదు, మతం నాణెం అయితే కులం దానికున్న విలువ. మనం నాణేన్ని చూస్తున్నాం, కులాన్ని చూడటంలేదు.
ఇంతకాలం - "మిత్రత్వమైనా శతృత్వమైనా ఆలోచనలతోనే, ఆ ఆలోచన వచ్చిన వ్యక్తితో ఎంతమాత్రమూ కాదు" అన్నాను, ఇహనుండి ఇలాంటి మూర్ఖులను కూడా ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం చేస్తాను.
ఆఖరిగా - కులానికి అంతటి ప్రాముఖ్యం లేకపోతే కులానికో చర్చి, మసీదు ఎందుకున్నాయో విచారణ చెయ్యండి. మన జాతిని, వంశాన్ని, కులాన్ని మన కంటే వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు; ఇలాంటి వాజమ్మలకు కనీసం వారి కులంలో పుట్టిన పూర్వీకులు తమ మతం కోసం ఎన్ని త్యాగాలు చేశారో కూడా కనీసం అవగాహన ఉండదు.
స్వామిభక్తి/రాజభక్తి/ప్రభుభక్తి ఉండే నేలలో రాజ్యలక్ష్మి సదా సిరులు కురిపిస్తుంది, దేశభక్తి అనేది సనాతన వాఙ్మయంలో మచ్చుకు ఎక్కడైనా కనిపిస్తే చూపగలరు. దేశభక్తి ఒకేఒక్క గుర్తింపును ఇవ్వగలదు, అందుకే ఈ తామసిక ప్రవృత్తి రాజ్యం ఏలుతోంది.
Comments
Post a Comment