ఏదైనా అపరాధానికి పాల్పడిన వ్యక్తి తను చేసిన అపరాధానికి చింతిస్తూ దానికి ప్రాయశ్చిత్తంగా ఏమైనా చెయ్యాలనుకుంటారు. ఇది మానవ జీవనంలో సహజ ప్రక్రియ. మనుషులు అనునిత్యం సంపూర్ణ వివేకంతో పూర్తిజ్ఞానంతో ఎన్నో తప్పులకు పాల్పడుతూ ఉంటారు. ఆ తప్పులను కొందరు మనఃస్ఫూర్తిగా అంగీకరిస్తారు, మరికొందరు దారిలేక అంగీకరిస్తారు. మనఃస్ఫూర్తిగా అంగీకరించే వారు పశ్చాత్తాపం చెందుతారు, ఆ అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం కోసం అన్వేషిస్తారు, చాలామంది దానిలో సఫలీకృతం ఔతారు. ఈ మారుమనస్సు అనే ప్రక్రియతో సమూహ నమ్మకాలు (cult beliefs) సమ్మిళితమై ఉంటాయి. వ్యక్తి తను చేసిన అపరాధాన్ని అంగీకరిస్తే ఇంతకాలం కష్టపడి సాధించిన పేరు, గౌరవం, పరువు, ప్రతిష్ఠలు, మానమర్యాదలు పోతాయని తమలోతామే చింతిస్తూ ఉంటారు. తామున్న మతంలో చేసిన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్త మార్గాల కోసం అన్వేషించకుండా, మానసిక ప్రశాంతతకు అడ్డదారులు అన్వేషిస్తారు. ఇలాంటి వారి ముఖకవళికలను పసిగట్టడంలో క్రైస్తవ మాఫియా ఆరితేరింది. క్రైస్తవ మాఫియా (సమూహ నమ్మకాల) ప్రకారం - "మనిషి స్వతహాగా పాపి, ఆ పాపం జెనెసిస్-లో అవ్వ (ఈవ్) సైతాను మాట విని జ్ఞానఫలం తినడం వలన సంక్రమించింది.
వాస్తవానికి దూరంగా ఉండే నిజమే అబద్ధం.