Skip to main content

Posts

Showing posts from 2022

కథాకేళి 03 - పోటీ

అవి నేను ఇంజినీరింగ్ చదువుకుంటున్న రోజులు -  అరుణకాంతులు విరజిమ్ముతూ భూమికి పూర్వదిక్కుగా ఉదయిస్తున్న భానుడికి మార్గనిర్దేశనం చేస్తున్న ఉషస్సు అప్పటిదాకా ధరణిని అలముకునున్న చిక్కని తిమిరాన్ని నిద్రలేపుతున్నట్లుగా ఉన్నట్లున్దీనాటి ఉషోదయం. శీతాకాలపు చలికి తాళలేక దుప్పటిచ్చే వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయి ముడుచుకుని పడుకున్న నేను కూడా లేచానా తిమిరంతోపాటు , పత్రికలలో ముద్రించబడిన సమాచారాన్ని మరియు గోవుల పొదుగుల నుండి సేకరించిన పాలను ఇంటింటా అందించడానికి. సమయం ఉదయం 05:30 కావొచ్చింది , పాలు-పత్రికలు చౌరస్తాకి ఇంకా రాలేదు. ఇప్పటికే అర్ధగంట ఆలస్యమైంది , ఇంకా ఆలస్యమైతే ఖాతాదారులు గొడవచేస్తారు , నేను కళాశాలకు వెళ్ళడంలో ఆలస్యమౌతుంది , అక్కడ మా శాఖాధిపతి అగ్గిమీద గుగ్గిలంలా ఎగురుతాడని నా బెంగ. మా ఊరికి ఆంధ్రజ్యోతి , ఈనాడు , వార్త , ఆంధ్రభూమి , సూర్య , డెక్కన్ క్రానికల్ , ది హిందూ , హన్స్ ఇండియా పత్రికలు వస్తాయి , ఈమధ్య సాక్షి పత్రిక కూడా రావడం మొదలయ్యింది. మేము ఆంధ్రజ్యోతి & ఈనాడు పత్రికలు చేరవేస్తాం. ఆ పాలు-పత్రికలు తెచ్చే వాహనదారులను నోరారా తిట్టుకుని , ఈ పోటీ ప్రపంచంలో సమయాన్న

వితండవాదన | బల్లిపురం నాగరాజు & పల్లవి (సయ్యద్ అష్రీన్ సుల్తానా)

వితండవాదన | బల్లిపురం నాగరాజు & పల్లవి (సయ్యద్ అష్రీన్ సుల్తానా)  నాగరాజు హిందువు, పైగా శూద్రవర్ణంలోని మాల కులస్తుడు. సుల్తానా మహ్మదీయురాలు మరియు సయ్యద్ 【సాధారణంగా సయ్యద్లను అష్రాఫ్-గా పరిగణిస్తారు. ఒకవేళ ఆమె అష్రాఫ్ ఐతే (!), మహ్మదీయుల్లో ఇదే అగ్రకులం】 సుల్తానాను వివాహమాడడానికి నాగరాజు మహ్మదీయుడిగా మారడానికి కూడా ప్రయత్నించాడు, కానీ సుల్తానా తల్లిదండ్రులు ససేమిరా అనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించాడు. జనవరి 2022లో నాగరాజు-సుల్తానా ఆర్యసమాజ్-లో మతాంతర వివాహం చేసుకున్నారు, సుల్తానా పల్లవిగా పేరు మార్చుకుంది. 2022 మే 04న సుల్తానా సోదరుడు నాగరాజును అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్యచేసిన సుల్తానా కుటుంబం & ఆమె సోదరుడు నాగరాజు హిందు మతంతో ఎంత క్షోభితులయ్యారో అతని మాల కులంతో కూడా అంతే క్షోభితులయ్యారు. అదునుచూసి నాగరాజును అంతమొందించారు.  "ఒకవేళ నాగరాజు హిందు అగ్రకులంలో పుట్టినట్లైతే సుల్తానా కుటుంబానికి ఉన్న అభ్యంతరాలు తగ్గి ఉండేవ!"ని బంధువులలోని ఒకరు వాపోయారని 'ది క్విన్ట్' పత్రిక వెల్లడించింది. ఈ పత్రిక ప్రచురించిన వార్తను పట్టుకుని కొందరు హిందువులమని చెప్పుకునే అవకాశవాద మ

ప్రొటెస్టెంటిజం బీజాలు | డైట్ ఆఫ్ వెర్మ్స్ 1521

ప్రొటెస్టెంటిజం బీజాలు | డైట్ ఆఫ్ వెర్మ్స్ 1521 సా.శ. 1516 జర్మనీలో మెయిన్జ్ ఆర్చిబిషప్పుగా ఆల్బ్రెక్ట్ వాన్ బ్రాండెన్బర్గ్ కొనసాగుతున్నాడు. రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క ఎక్లెసియాస్టిక్ కౌన్సిల్'లో గౌరవస్థానాన్ని ఆశించి దానిని పొందడానికి (కొనడానికి) భారీమొత్తంలో ధనాన్ని వెచ్చించిన బ్రాండెన్బర్గ్ ఈ ధనాన్ని తన జిల్లాపరిధిలోని ధనిక-కులీన వర్గాల నుండి అప్పుగా తీసుకున్నాడు. ఐతే అప్పు తీర్చడానికి బ్రాండెన్బర్గ్-కు నిరంతర ధనప్రవాహం అవసరమైంది. ఇదే సమయంలో హోలీ రోమన్ చర్చి బిషప్పు పోప్ 10వ లియోకు రోమ్ నగరంలో సెయింట్ పీటర్ బాసిలికా చర్చి నిర్మాణ నిమిత్తం పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. అప్పుడు ఇద్దరి ధన అవసరాలు నెరవేరడం కోసరం ఇండల్జెన్స్-ను మరలా అమ్మకానికి పెట్టే ప్రతిపాదనను ఆర్చిబిషప్పు బ్రాండెన్బర్గ్ పోప్ 10వ లియో ముందుంచాడు మరియు ఆ అమ్మకాల ద్వారా వచ్చిన ధనంలో సమవాటా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.  డోక్ట్రిన్ ఆఫ్ టు కింగ్డమ్స్ ప్రకారం సెక్యులర్ (టెంపోరల్) రాజ్యంలో క్రైస్తవులు చనిపోయిన తర్వాత స్పిరిచ్యువల్ రాజ్యంలోని స్వర్గానికి చేరుకోవడానికి ముందుగా చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పర్గేటరీలో

నరుటో షిప్పుడెన్ | లునానా (2019) - యాక్ లెబీ ల్'హాదా

కనోహా అనే గ్రామంలో ఒకరోజు సాసుకే ఉచీహా - "గ్రామం అంటే ఏమిటి?" అనే ప్రశ్నను ఆ గ్రామాన్ని స్థాపించిన 'హషీరామా సెంజు'ను అడుగుతాడు. తన అన్న ఇటాచీ ఉచీహా కనోహా గ్రామంకోసం ఎందుకని ఎవ్వరూ కలలో కూడా ఊహించనన్ని పనులు చేశాడు? ఆఖరికి అదే గ్రామానికి ఒక శత్రువులా తనను తానెలా ఆవిష్కరించుకున్నాడనే సందేహాలకు సమాధానాల కోసం హషీరామా సెంజును కలుస్తాడు సాసుకే ఉచీహా. హషీరామా ఇలా చెప్పడం మొదలుపెడతాడు - "గ్రామం అంటే దాని ఏర్పాటుకు కారణభూతమైన అన్ని విషయాలకలబోత. అందులో ఏ ఒక్కటి తగ్గినా ఆ గ్రామం గ్రామమనిపించుకోదు, అదొక సమూహంగా మాత్రమే మిగిలిపోతుంది. ఈ సెలయేరు, ఆ పక్షుల కూతలు, అనేక వంశాల రహస్య కళలు, పిల్లల కేరింతలు, పశువుల తుళ్ళింతలు, పీల్చే గాలి, ఎక్కే చెట్టు, అక్కడున్న పర్వతాలు, మనమున్న మట్టి, మనతో ఉన్న జనాలు ఇలా వీటన్నిటితో కలిసి ఒక గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే గ్రామం." ఒక్కొక్క పట్టణానికి మరియు నగరానికి తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండటం చాలామంది వినేఉంటారు. ఆ గుర్తింపుకు కారణమైన అన్నింటినీ గుర్తించడంలో మాత్రం అందరూ విఫలులవుతారు. అలా విఫలమైన గుర్తింపులకు చిరునామాలే ఈనాటి గ్రామాలు!

వాలిసంహారం | ఆశ్వయుజ శుద్ధపౌర్ణమి

అనగనగా ఒక ఆశ్వయుజ శుద్ధపౌర్ణమినాడు కిష్కింధారణ్యంలో బలశాలులైన ఇద్దరు వానరసోదరులు బాహాబాహీగా ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలను ప్రయోగించుకుంటున్నారు. ద్వంద్వయుద్ధంలో అలసిన ఒక వానరం యొక్క ముష్టిఘాతాల శక్తి అల్పమవుతూపోగా, మరొక వానరం యుద్ధం కోసమే పుట్టినట్లుగా తన ముష్టిఘాతాల శక్తిని అంతకంతకూ అధికం చేస్తూపోతోంది.  ఇంతలో అరణ్యప్రాంతంలో పదిలంగా పరుచున్న నీటిఆవిరిని చెల్లాచెదురుచేస్తూ స్థిరమైన వాయు గమనాన్ని బెదిరిస్తూ వింటినారిపై ఆ కర్ణాంతమూ సాగదియ్యబడిన బాణమొకటి శక్తివంతమైన వానరుని హృదయాన్ని ప్రవేశించి దాన్ని చీల్చుకుంటూ లిప్తకాలంలో బయటకి వచ్చింది. ఆ వానరం - "అమ్మా...." అంటూ అరణ్యపు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా గావుకేకపెట్టి నేలకొరిగింది. నేలకొరిగే సమయంలో తన భార్య తార చెప్పిన హితవాక్యాలు స్ఫురణకు వచ్చాయి, వాటిని పెడచెవిన పెట్టినఫలితమే ఇదని పశ్చాత్తాపపడింది.  ఆ అంబును విడిచిన ఇద్దరు నరసోదరులు దేదీప్యమానమైన తేజస్సుతో శోభిస్తున్నారు. వారు ఇక్ష్వాకు రామలక్ష్మణులని గుర్తించింది ఆ నేలకొరిగిన వానరం, తార మాటలు మళ్ళీ నిజమయ్యాయని అనిపించింది. ఊపితిత్తుల నుండి శ్వాస విడిచిపోతోందన్న బాధలో అణచుకులేని క్ర

భాషానువాదం 02 - కాశ్మీరీ హిందువుల 7వ నరమేధం (జనవరి 19 1990)

విక్రమశకం 2078, ఫాల్గుణ కృష్ణపక్షం  కొంతకాలం క్రితం జనవరి 19 1990నాటి కాశ్మీరంలోని విధివికటించిన పరిస్థితుల మీద ఒక వ్యాసం వ్రాశాను; దాని శీర్షిక - "జనవరి 19 1990ని కాశ్మీరలోయవాసుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు?" ఒకరోజున నేను వ్రాసిన పుస్తక పరిచయ కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రసంగం మరియు సుదీర్ఘమైన ప్రశ్నోత్తరాల అనంతరం ఆ సభలోని ఒక యువతి అడిగిన ప్రశ్న - "పొరుగింటివారి భాగస్వామ్యం లేకుండా జాతినిర్మూలనకై జరిపే నరమేధం సాధ్యమవ్వదని మీరెందుకన్నారు?"  క్రమానుగత హత్యాకాండ ద్వారా అంతమొందించబడిన కాశ్మీరీ హిందువుల జీవనశైలిని విశదీకరిస్తూ నేను వ్రాసిన కాల్పనిక కథానిక 'ది ఇన్ఫిడెల్ నెక్స్ట్ డోర్' యొక్క పరిచయ ప్రసంగాలు చివరిదశలోనున్న రోజులవి. ప్రతి ప్రసంగంలోనూ కాశ్మీరీ పండితులు నాతో సభావేదికను పంచుకున్నారు. కాశ్మీరీలు ఆ బలవంతపు బహిష్కరణ ఘట్టాన్ని నెమరువేసుకునే సమయంలో వారిలోని భావోద్వేగాల పచ్చిగాయాలు సుస్పష్టమవ్వసాగాయి, పర్వతపు పగుళ్ళనుండి పారే నీటిధారలా వారి ఉద్వేగాలు పారాయి. వారి బాధాతప్త భావోద్వేగాలు దశాబ్దాల తరబడి సీసాలో బంధింపబడి ప్రాపంచిక చక్షువులకు కనపడబడకుండా

రిపెంటన్స్ | పశ్చాత్తాపం & మారుమనస్సు

ఏదైనా అపరాధానికి పాల్పడిన వ్యక్తి తను చేసిన అపరాధానికి చింతిస్తూ దానికి ప్రాయశ్చిత్తంగా ఏమైనా చెయ్యాలనుకుంటారు. ఇది మానవ జీవనంలో సహజ ప్రక్రియ. మనుషులు అనునిత్యం సంపూర్ణ వివేకంతో పూర్తిజ్ఞానంతో ఎన్నో తప్పులకు పాల్పడుతూ ఉంటారు. ఆ తప్పులను కొందరు మనఃస్ఫూర్తిగా అంగీకరిస్తారు, మరికొందరు దారిలేక అంగీకరిస్తారు. మనఃస్ఫూర్తిగా అంగీకరించే వారు పశ్చాత్తాపం చెందుతారు, ఆ అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం కోసం అన్వేషిస్తారు, చాలామంది దానిలో సఫలీకృతం ఔతారు.  ఈ మారుమనస్సు అనే ప్రక్రియతో సమూహ నమ్మకాలు (cult beliefs) సమ్మిళితమై ఉంటాయి. వ్యక్తి తను చేసిన అపరాధాన్ని అంగీకరిస్తే ఇంతకాలం కష్టపడి సాధించిన పేరు, గౌరవం, పరువు, ప్రతిష్ఠలు, మానమర్యాదలు పోతాయని తమలోతామే చింతిస్తూ ఉంటారు. తామున్న మతంలో చేసిన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్త మార్గాల కోసం అన్వేషించకుండా, మానసిక ప్రశాంతతకు అడ్డదారులు అన్వేషిస్తారు. ఇలాంటి వారి ముఖకవళికలను పసిగట్టడంలో క్రైస్తవ మాఫియా ఆరితేరింది.  క్రైస్తవ మాఫియా (సమూహ నమ్మకాల) ప్రకారం - "మనిషి స్వతహాగా పాపి, ఆ పాపం జెనెసిస్-లో అవ్వ (ఈవ్) సైతాను మాట విని జ్ఞానఫలం తినడం వలన సంక్రమించింది.

స్థితప్రజ్ఞత!

పుష్య 22 1943 | సర్వకాల సర్వావస్థల్లో మనసును విచలితం అవ్వకుండా, ఎటువంటి చింత లేకుండా మనసును నిర్మలంగా ఉంచుకునే మానసికస్థితిని స్థితప్రజ్ఞత అంటారు. ఈ ప్రజ్ఞ క్లిష్టమైన పరిస్థితులలోనే కాదు, అమిత సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా అవలంభించాల్సి ఉంటుంది, అప్పుడే అది స్థితప్రజ్ఞత అనిపించుకుంటుంది.  మనం అందరం మనల్ని మనం స్థితప్రజ్ఞులుగానే భావిస్తాం, కాకపోతే పరిస్థితి కొంచెం తారుమారవ్వగానే మన నిజస్వరూపం బయటకు వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ నిజస్వరూపానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావమే మన జీవనగమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. మంచి పరిస్థితి ఎదురైనప్పుడు ఆనందంలో ఉండి మనచుట్టూ ఉన్నవారికి మంచి చెయ్యాలనిపిస్తుంది, చేదు అనుభవం ఎదురైనప్పుడు క్రోధంలో ఉండి మనచుట్టూ ఉన్నవారి గురించి పట్టించుకోవాలనిపించదు. ఇవి స్థిరమైన ఆలోచనలు కావు, పరిస్థితుల ప్రభావానికి లోనయిన మనసు యొక్క చపలచిత్తానికి నిదర్శనాలు. ఈ చపలచిత్తాన్ని మార్గదర్శనంగా తీసుకుని జీవనసోపానాలను ఎక్కితే ఒకానొకచోట ఒకానొక సమయంలో ఆ పాతమెట్లనే మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది. నైతికత నశిస్తుంది, విలువలు వర్షపు నీరులా సముద్రంలో కలిసి త్రాగడానికి పనికిరాకుండా పోతాయ

జెనెసిస్ | సృజన & సృష్టి

ఇంగ్లీషు బైబిల్ | జెనెసిస్ 1వ అధ్యాయం 1వ వాక్యం : "In the beginning God created the heavens and the earth." 2019కి పూర్వం తెలుగు బైబిల్ | ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం : "ఆదియందు దేవుడు (గాడు = గాడ్) భూమ్యాకాశాలను సృజించెను." తెలుగు బైబిళ్ళలో 'క్రియేటెడ్' అనే పదాన్ని 2019కి ముందు 'సృజించాడు' అనీ, 2019 తర్వాత 'సృష్టించాడు' అనీ అనువదించారు క్రైస్తవ అనువాదకులు. ఆ వాక్యం : "ఆదియందు దేవుడు (గాడు = గాడ్) భూమ్యాకాశాలను సృష్టించాడు." ఇంగ్లీషులో గాడును 'క్రియేటర్ గాడ్' అనీ, 2019కి పూర్వం తెలుగులో గాడును 'సృజనకర్త' అని సంభోదించేవారు. అలాంటిది ఒక్కసారిగా సృజనకర్త నుండి సృష్టికర్తగా బైబిల్ గాడు రూపాంతరానికి గల కారణాలను కనుగొనే ప్రయత్నం చేద్దాం!  'క్రియేషన్' పదం యొక్క సామాన్య అర్థం 'సృజన', అంటే "మలచడం" అని అర్థం. ఏదైనా ఒక కళాఖండ నిర్మాణం జరగాలి అంటే కళ ఎంత ముఖ్యమో ముడిపదార్థం మరియు పనిముట్లు కూడా అంతే ఆవశ్యకం. ముడిపదార్థం, కళ, కళాకారుడు, పనిముట్లు లేకుండా కళాఖండ నిర్మాణం అసంభవం. కళాకారుడు పనిముట్ల సహాయంత