నా గురించి కొన్ని అపోహలు నడుస్తున్నాయి. ఇవాళ వాటికి చరమగీతం పాడదామని నిర్ణయించుకున్నాను. నేను బ్రాహ్మణుడిని అనేది ఒక అపోహ. నేను శూద్రుడిని, నాది కాపు జాతి, కృష్ణాజిల్లా నాయుడు కులం. నేను బ్రాహ్మణ పక్షపాతిని అనేది మరొక అపోహ. వ్యక్తికి జరిగే అన్యాయాన్ని అడగడం & చెప్పడం తప్పైతే, అవును నేను పక్షపాతినే... అన్యాయం ఎవరికి జరిగితే వారి వైపునే నిలబడే పక్షపాతిని నేను. నేను బ్రాహ్మణత్వంలోకి దూకాలని భావిస్తున్నాను అనేది అర్థంలేని వాదన. నేనేంటో నాకు తెలుసు, నా కులం పరిమితులు మరియు శక్తి-సామర్థ్యాలు నాకు తెలుసు, వర్ణాశ్రమంలో నా జాతి-కులం యొక్క స్థాయి నాకు తెలుసు. నా జాతి-కులానికి నేను ఎంతవరకు ఉపయోగపడగలను, తద్వారా సమాజ నిర్మాణానికి ఎంతవరకు దోహదపడగలను అనేది తప్ప నాకు ఇంకొక ఆశా లేదు, ఆలోచన అస్సలే లేదు. ఇహ అసలు విషయానికి వస్తే, బ్రాహ్మణులతో నేను సమానం కాదు, కాలేను కూడా. వాళ్ళని వ్యతిరేకించే (ఈమధ్య ఇది ద్వేషంగా మారింది) వారు ఎందుకు ద్వేషిస్తున్నారు అంటే వారితో పోటీపడలేక అనేది మాత్రమే సత్యం. ఒక వ్యక్తితో పోటీపడలేనప్పుడు నలుగురు వెధవలను తీసుకెళ్లి ఆ వ్యక్తిని తన్నించడం అనే మానసిక స్థితి ఇక్కడ పనిచేస్త
వాస్తవానికి దూరంగా ఉండే నిజమే అబద్ధం.