ప్రపంచం నలుమూలలా శిశుజననాలు పతనమౌతున్నాయి మరియు వయోమరణాలు అధికమౌతున్నాయి. ప్రపంచం నేడు ఎదుర్కుంటున్న తీవ్రమైన సమస్య అతిజనాభా కాదు అల్పజనాభా. అనగా మరికొన్ని దశాబ్దాలలో నేటి సమయంలో మనుగడలో ఉన్న అనేక వంశాలకు వారసులు ఉండరు! మరి ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఏం చేస్తున్నాయి? దేశ స్థూల జాతీయోత్పత్తి పతనం అవుతుందేమోనని ఇతర దేశాల నుండి వలసలను ప్రోత్సహిస్తున్నాయి. ఇలా చేస్తే ఆ దేశ సంస్కృతి దెబ్బతినడంతోపాటుగా దేశంలో ఆయా ప్రాంతాలు, ప్రదేశాలలో ఉన్న సహజ వనరులు త్వరగా నిర్వీర్యం కూడా అయిపోతాయి. ప్రాంతీయులకు అక్కడి సంస్కృతి, ఆచారాలు, వాతావరణంపై ఉన్న అవగాహన, సమగ్రదృష్టి, మమకారం వలసీయులకు ఉండదు. దీనితో ఆ దేశాల సంస్కృతి దెబ్బతిని, ఆచారాలు మంటగలసి, అక్కడి వాతావరణం పెనుమార్పులకు గురౌతుంది. ఐతే ఆధునిక యుగంలో ఇంతకుమించిన ఉపాయం ఎవ్వరి దగ్గరాలేదు. ఆధునిక మేధావుల మేధోగంభీరత ఇక్కడితో ముగుస్తుంది! మరేం చెయ్యాలి? సంతానాన్ని కనేలా దేశపౌరులను ప్రోత్సహించాలి, ముఖ్యంగా స్త్రీలను. కానీ అలా చెయ్యడంలో దేశ ప్రభుత్వాల వైఫల్యాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? మహిళా విద్యను ఒక కారణంగా పేర్కొనవచ్చు. విద్యాధికులై
వాస్తవానికి దూరంగా ఉండే నిజమే అబద్ధం.