ఆంజనేయుడు రావణలంకానగరాన్ని విధ్వంసంగావించి తిరిగి దక్షిణసాగరాన్ని లంఘించి ఉత్తరతీరానున్న మహేంద్రగిరికి చేరుకున్నాక జాంబవంతుడు - "హనుమా! అక్కడ జరిగినవి జరిగినట్టుగా చెప్పు. దానినిబట్టి ప్రభువుల దగ్గర చెప్పాల్సినవి చెప్పకూడనివి ఏమైనా ఉంటే తెలుస్తుంది" అంటాడు.
అది స్వామిభక్తి/ప్రభుభక్తి మెండుగా ఉన్న కాలం, అందులోనూ జాంబవంతుడి స్వామిభక్తిని ఇప్పటివరకూ ఎవ్వరూ శంకించే సాహసం చెయ్యలేదు. అలాంటివాడు ప్రభువుకు చెప్పకూడని అంశాలు ఉంటాయనే సూచన ఇస్తున్నాడు.
వీరులు ఎంతటి గొప్పవారైనా వారు ప్రభువులకు దాసులు, దూతగా పంపబడిన దాసుడు మోసుకొచ్చే సమాచారం ప్రాణసంకటంగా మారుతుండడం అతి సహజం. అందునా మనోడు (ఆంజనేయుడు) చేసొచ్చింది లంకా దహనం, అశోకవన భూస్థాపనం.
"సీతమ్మకు ఏమీ జరగలేదు, ఆమె క్షేమమే"ననే వ్యవధిలో కుత్తుక తెగడానికి అవకాశాలు అనేకం. పోనీ ఆ సంగతి రాముడికి చెప్పనేలేదా అంటే, ఉవ్వెత్తున ఎగసిన విరహ తాపాలు సర్దుమణిగిన పిదప చెప్పనే చెప్పాడు. అప్పటికి ఆవేశం చల్లారి, బుద్ధి పనిచెయ్యడం ప్రారంభమౌతుందని.
అలాంటిది స్వామిభక్తి అనేది ఇసుమంతైనాలేని ఈకాలంలో చాడీలు చెప్పేవారు, యజమానికి గూఢచారిగా ఉండేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అన్నీ పూసగుచ్చినట్లు చెప్పడంలో వివేకం ఎంత? "ఇంజనీర్లు అందరం ఒకటిగా ఉండాలి. మనలో తేడాలు ఉన్నా, అవి మనకే పరిమితం అవ్వాలి. యజమానికి అవన్నీ తెలిస్తే మనల్ని భేదోపాయంతో జయిస్తాడు" అంటే, ఆ విషయాన్ని కూడా తీ(మో)సుకెళ్ళి యజమానికి చెప్పిన దౌర్భాగ్యులున్నారు! 🤦
ఇన్ని జాగ్రత్తలు తీసుకునే యజమానికి ఆ చాడీలు చెప్పే & గూఢచర్యం చేసే వ్యక్తులను అవసరానికి వాడుకోవడం, ఆ అవసరం తీరాక విసిరెయ్యడం చేతకాదా? ఈ అవలక్షణాన్ని వదులుకోవడమే హిందువుల ( & నాయుళ్ళ) తక్షణ కర్తవ్యం.
మరొక విషయం | రామాయణం 12600 సంవత్సరాల పూర్వం జరిగిందని నిలేశ్ ఓక్ గారు అంటుంటారు, అదే వ్యక్తి అప్పట్లో సముద్రమట్టం ఇంత పైకి ఉండేది కాదు, అక్కడక్కడా లోతుగా ఉండేది అనడానికి ఆధారాలు కూడా సేకరించారు. గుంతలను చెట్లకొమ్మలతో రాళ్ళతో రప్పలతో పూడ్చి వారధి కట్టుకుంటూ రావణలంకను రామలక్ష్మణులు వానరసైన్యంతో కలిసి చేరారు అంటారు.
సముద్రం అంత ఎత్తుగా లేకపోతే ఆంజనేయుడు సముద్ర లంఘనం ఎందుకు చేసినట్లు? లోతు ఎక్కువగా ఉన్నచోట ఈదుతూ, లోతు తక్కువగా ఉన్నచోట నడుస్తూ వెళితే అయిపోయేదిగా! కానీ గరుత్మంతుడు వెళ్ళే మార్గంలో ఎగురుతూ వెళ్ళడం అవసరం లేదు కదా! పైగా అంతగా ఎగురుతూ వెళ్లొచ్చినా ఒక మాసం సమయం పట్టింది ఆంజనేయుడికి (సీతమ్మ ఆంజనేయుడికి రెండు మాసాలు గడువుంది అంటుంది, తిరిగొచ్చిన ఆంజనేయుడు ఇంకొక్క మాసమే గడువుంది అంటాడు రాముడితో).
అదీకాక రావణలంక రక్షణావ్యవస్థను వర్ణిస్తూ ఆంజనేయుడు - పరిఖలు (గేర్లు), యంత్రాలు, శతఘ్నులు, అగడ్తలు (ట్రెంచ్), నీటి అగడ్తలు (ట్రెంచ్ పాండ్స్), బాణాలు & శిలలను విసిరే యంత్రాల గురించి ప్రస్తావిస్తాడు.
తెల్లజాతి క్రైస్తవుల మనోకలిత భ్రమకు రూపమైన చరిత్ర (గతాన్ని చూడడానికి ఇదొక ఫ్రేమ్వర్క్ మాత్రమే) ప్రకారం గేర్లు సా.శ. 10వ శతాబ్దం వరకూ కనుగొనలేదు, అగడ్తల ప్రస్తావన పూర్వ సా.శ. 6వ శతాబ్దం వరకూలేదు, బాణాలు & శిలలను విసిరే యంత్రాలు సా.శ. 10వ శతాబ్దం వరకూ కనిపించదు.
ఇక్కడ నాకు కనిపిస్తున్న కొన్ని అంశాలు -
1. ఆంజనేయుడు లంకకు ఎగిరి వెళితే, రామాయణం 12600 సంవత్సరాల క్రితం జరగడం అనేది సహేతుకం కాదు.
2. రామాయణం నేటికి కనీసం 5100 సంవత్సరాల పైబడిన కాలంలో (మహాభారతం కంటే ముందే జరిగింది కనుక) జరిగిందంటే అప్పటికే గేర్లు, యంత్రాలు, వగైరాలు కనుగొనడం జరిగింది. ఇప్పుడు చరిత్రగా చెబుతున్న దాన్లో ఉన్న యుద్ధ పరికరాలు కొత్తవేమీకాదు.
Comments
Post a Comment