Skip to main content

స్వామిభక్తిలో మెళకువలు

ఆంజనేయుడు రావణలంకానగరాన్ని విధ్వంసంగావించి తిరిగి దక్షిణసాగరాన్ని లంఘించి ఉత్తరతీరానున్న మహేంద్రగిరికి చేరుకున్నాక జాంబవంతుడు - "హనుమా! అక్కడ జరిగినవి జరిగినట్టుగా చెప్పు. దానినిబట్టి ప్రభువుల దగ్గర చెప్పాల్సినవి చెప్పకూడనివి ఏమైనా ఉంటే తెలుస్తుంది" అంటాడు.

అది స్వామిభక్తి/ప్రభుభక్తి మెండుగా ఉన్న కాలం, అందులోనూ జాంబవంతుడి స్వామిభక్తిని ఇప్పటివరకూ ఎవ్వరూ శంకించే సాహసం చెయ్యలేదు. అలాంటివాడు ప్రభువుకు చెప్పకూడని అంశాలు ఉంటాయనే సూచన ఇస్తున్నాడు.

వీరులు ఎంతటి గొప్పవారైనా వారు ప్రభువులకు దాసులు, దూతగా పంపబడిన దాసుడు మోసుకొచ్చే సమాచారం ప్రాణసంకటంగా మారుతుండడం అతి సహజం. అందునా మనోడు (ఆంజనేయుడు) చేసొచ్చింది లంకా దహనం, అశోకవన భూస్థాపనం.

"సీతమ్మకు ఏమీ జరగలేదు, ఆమె క్షేమమే"ననే వ్యవధిలో కుత్తుక తెగడానికి అవకాశాలు అనేకం. పోనీ ఆ సంగతి రాముడికి చెప్పనేలేదా అంటే, ఉవ్వెత్తున ఎగసిన విరహ తాపాలు సర్దుమణిగిన పిదప చెప్పనే చెప్పాడు. అప్పటికి ఆవేశం చల్లారి, బుద్ధి పనిచెయ్యడం ప్రారంభమౌతుందని.

అలాంటిది స్వామిభక్తి అనేది ఇసుమంతైనాలేని ఈకాలంలో చాడీలు చెప్పేవారు, యజమానికి గూఢచారిగా ఉండేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అన్నీ పూసగుచ్చినట్లు చెప్పడంలో వివేకం ఎంత? "ఇంజనీర్లు అందరం ఒకటిగా ఉండాలి. మనలో తేడాలు ఉన్నా, అవి మనకే పరిమితం అవ్వాలి. యజమానికి అవన్నీ తెలిస్తే మనల్ని భేదోపాయంతో జయిస్తాడు" అంటే, ఆ విషయాన్ని కూడా తీ(మో)సుకెళ్ళి యజమానికి చెప్పిన దౌర్భాగ్యులున్నారు! 🤦 

ఇన్ని జాగ్రత్తలు తీసుకునే యజమానికి ఆ చాడీలు చెప్పే & గూఢచర్యం చేసే వ్యక్తులను అవసరానికి వాడుకోవడం, ఆ అవసరం తీరాక విసిరెయ్యడం చేతకాదా? ఈ అవలక్షణాన్ని వదులుకోవడమే హిందువుల ( & నాయుళ్ళ) తక్షణ కర్తవ్యం.

మరొక విషయం | రామాయణం 12600 సంవత్సరాల పూర్వం జరిగిందని నిలేశ్ ఓక్ గారు అంటుంటారు, అదే వ్యక్తి అప్పట్లో సముద్రమట్టం ఇంత పైకి ఉండేది కాదు, అక్కడక్కడా లోతుగా ఉండేది అనడానికి ఆధారాలు కూడా సేకరించారు. గుంతలను చెట్లకొమ్మలతో రాళ్ళతో రప్పలతో పూడ్చి వారధి కట్టుకుంటూ రావణలంకను రామలక్ష్మణులు వానరసైన్యంతో కలిసి చేరారు అంటారు.

సముద్రం అంత ఎత్తుగా లేకపోతే ఆంజనేయుడు సముద్ర లంఘనం ఎందుకు చేసినట్లు? లోతు ఎక్కువగా ఉన్నచోట ఈదుతూ, లోతు తక్కువగా ఉన్నచోట నడుస్తూ వెళితే అయిపోయేదిగా! కానీ గరుత్మంతుడు వెళ్ళే మార్గంలో ఎగురుతూ వెళ్ళడం అవసరం లేదు కదా! పైగా అంతగా ఎగురుతూ వెళ్లొచ్చినా ఒక మాసం సమయం పట్టింది ఆంజనేయుడికి (సీతమ్మ ఆంజనేయుడికి రెండు మాసాలు గడువుంది అంటుంది, తిరిగొచ్చిన ఆంజనేయుడు ఇంకొక్క మాసమే గడువుంది అంటాడు రాముడితో).

అదీకాక రావణలంక రక్షణావ్యవస్థను వర్ణిస్తూ ఆంజనేయుడు - పరిఖలు (గేర్లు), యంత్రాలు, శతఘ్నులు, అగడ్తలు (ట్రెంచ్), నీటి అగడ్తలు (ట్రెంచ్ పాండ్స్), బాణాలు & శిలలను విసిరే యంత్రాల గురించి ప్రస్తావిస్తాడు.

తెల్లజాతి క్రైస్తవుల మనోకలిత భ్రమకు రూపమైన చరిత్ర (గతాన్ని చూడడానికి ఇదొక ఫ్రేమ్వర్క్ మాత్రమే) ప్రకారం గేర్లు సా.శ. 10వ శతాబ్దం వరకూ కనుగొనలేదు, అగడ్తల ప్రస్తావన పూర్వ సా.శ. 6వ శతాబ్దం వరకూలేదు, బాణాలు & శిలలను విసిరే యంత్రాలు సా.శ. 10వ శతాబ్దం వరకూ కనిపించదు.

ఇక్కడ నాకు కనిపిస్తున్న కొన్ని అంశాలు - 

1. ఆంజనేయుడు లంకకు ఎగిరి వెళితే, రామాయణం 12600 సంవత్సరాల క్రితం జరగడం అనేది సహేతుకం కాదు.

2. రామాయణం నేటికి కనీసం 5100 సంవత్సరాల పైబడిన కాలంలో (మహాభారతం కంటే ముందే జరిగింది కనుక) జరిగిందంటే అప్పటికే గేర్లు, యంత్రాలు, వగైరాలు కనుగొనడం జరిగింది. ఇప్పుడు చరిత్రగా చెబుతున్న దాన్లో ఉన్న యుద్ధ పరికరాలు కొత్తవేమీకాదు.

Comments

ప్రసిద్ధమైన పోస్టులు

భాషానువాదం 01 - ఆఫ్ఘనిస్థాన్లో ఆఖరి హిందువు

విక్రమశకం 2078, భాద్రపద పౌర్ణమి  ఆఫ్ఘనిస్థాన్ నుండి పారిపోకుండా అక్కడే ఉన్న ఆఖరి హిందువు ఒక హిందు పూజారి (హిందు ప్రీస్ట్). ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. చెరిగిపోని చరిత్రలో శాశ్వతమైన గుర్తింపును హిందువులు ముద్రించగలిగారు అంటే ఇలాంటి వీరోచిత పోరాటాల ఫలితమే. ఆఫ్ఘనిస్థాన్ నుండి ప్రాణాలకు భయపడి పలాయనం చిత్తగించకుండా, పూర్వం నుండి వస్తున్న దేవతారాధనను కొనసాగిస్తున్న ఆ ఒంటరి హిందువు యొక్క ముఖచిత్రం హిందు నాగరికత చరిత్రలో ఒక మైలురాయిగా స్థిరపడుతుంది మరియు ఆఫ్ఘనిస్థాన్లో హిందు ధర్మం ఎలా నాశనం కాబడిందో భవిష్యత్తు తరాలకు ఒక పాఠంలా నిలిచిపోతుంది. ఆఫ్ఘనిస్థాన్ త్వరలో "ఇక్కడ కాఫీర్లు ఎవ్వరూ బ్రతికిలేరు" అనే బ్యానర్లు కట్టడం మొదలుపెట్టొచ్చు.! ఈ సంఘటన బహుభయంకరమైన సత్యాన్ని ప్రకటిస్తుంది, ఇది మాటల్లో చెప్పలేని ఉద్విగ్నత. ఈ అంతానికి ఆరంభం కొన్ని శతాబ్దాల క్రితం "మోమిన్లు/నమ్మకస్తులు" & "కాఫీర్లు/అపనమ్మకులు" అనే విభజన ఆధారం అయ్యింది, వీరిమధ్య జరిగే యుద్ధం కాఫీర్ల వినాశనంతోనే ఆగుతుంది అనే భయం అందరిలో నిగూఢంగా దాగి ఉంది. ఈ అమానుషంలో చివరి అంకం వందల సంవత్సరాల పూర్వం

కువకువలు 03 - చిన్న కలలు, చిన్నచిన్న భయాలు

విక్రమశకం 2079, శ్రావణ కృష్ణపక్షం  నా కలలు నన్ను భయపెడతాయి. వాటిని నేను అందుకోగలనో లేదో అనే చిన్ని భయం నన్ను నా ఆశయాలవైపుకి నెమ్మదిగా తోస్తుంది.  ఆ ఆశయాన్ని అందుకునే క్రమంలో & ఆ భయాన్ని ఛేదించే క్రమంలో నేను పొందే అనుభవాలు, నాకు కలిగే అనుభూతులు, నాలో వచ్చే అవిరళ మార్పులు, నాకు నేను ఇచ్చుకునే ఓదార్పులు నన్ను నా ఆశయాలను దగ్గరగా చేస్తాయి. 'లక్ష్యాలు సాధించలేమేమో' అనే భయం నుండి వచ్చే ధైర్యం నిరంతరం నింపాదిగా ఉంటుంది, నిండు కుండలా ఉంటుంది, తొణకదు, బెణకదు, వెరవదు, జంకదు. అలా స్థిరంగా ఉంటుంది. ఆ ఆశయం ఇహ నన్ను భయపెట్టలేదు. నా భయం ఆగిపోయిన తర్వాత జరిగేది ఒక్కటే... నేను నా ఆశయాన్ని చేరుకోవడం. మరి తర్వాత? మరొక ఆశయం, మరొక భయం, మరిన్ని సంఘర్షణలు, మరెన్నో అనుభవాల పాఠాలు, కొన్ని అపజయాలు, ఎన్నెన్నో విజయాలు, మళ్ళీ ఓనమాలు మామూలే... జీవితం అందమైనది అని చెప్పడం తేలిక, దాన్ని చేసి చూపెట్టడం చాలా కష్టం. జీవితాన్ని అద్భుతంగా జీవించే పద్ధతిని ఔపోసన పడితే అందులో ఉండే అమృతతరంగాలు మనల్ని అఖండ అలౌకిక ఆనందతీరాలకు చేరుస్తాయి. ఏదో ఒకనాడు నేను ఆ తీరాలను స్పృశిస్తాను. ఒకవేళ ఆ ఆనందతీరాలను చేరుకోలేదు అంటే, నే

వాకిట్లో వర్షం పడుతోంది.!

వాకిట్లో వర్షం పడుతోంది.! వర్షంలో తడిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి, అంతకంటే ఎక్కువగా ఆ వర్షంలో నీతో కలిసి వేసిన అడుగులు గుర్తొస్తున్నాయి. గొడుగు పక్కకి పారేసి, నీ చున్నీలో దాక్కున్న చిలిపి చేష్టలు గుర్తొస్తున్నాయి. వానలో మనం కృష్ణా-గోదావరీ సంఘమంలా కలిసి నడుస్తుంటే మనల్ని చూసి కుళ్ళుకుని మేఘాలు చేసిన ఘీంకారాలు ఇంకా నాకు గుర్తున్నాయి. తడిచిన బట్టల్లో మనం చేసుకున్న ఆలింగనాలు నాకు ఇంకా గుర్తున్నాయి, ఒకరికొకరం మార్చుకున్న వాగ్ధానాలు ఇంకా నాకు గుర్తున్నాయి. తొలకరి జల్లుల్లో వచ్చే మట్టి సువాసన నీ శరీరం వెదజల్లే సుగంధంతో కలిసి నన్ను తన్మయత్వంలోకి నెట్టేసిన క్షణాలు ఇంకా నాలో జీవించేవున్నాయి. వానలో నా చెయ్యి పట్టుకుని నాతో నడిచిన నీ వయ్యారపు నడకలు నాకింకా గుర్తున్నాయి, నీ వలపుల కవ్వింతలు నన్నింకా కలవరానికి గురిచేస్తున్నాయి. కృష్ణమ్మ నీటి రుచి గోదారి నీటి వంపులతో సంపూర్ణం అయినట్లు, నీలో నన్ను కలిపేసుకున్న నువ్వు నాకింకా గుర్తున్నావు. వాన పడిన ప్రతిసారీ నీతో కలిసి తడవాలని, నడవాలని, కలిసిపోవాలని, విడదీయలేని బంధమైపోవాలని, నీ శరీరంలో ఒక భాగమైపోవాలని వచ్చిన ఎన్నో ఆశలు...అడియాశలుగా మారడం నాక

కువకువలు 02 - సరితాగానం

విక్రమశకం 2078, ఆషాఢ కృష్ణపక్షం  మనసు బాగోనప్పుడు ఒంటరిగా వర్షంలో కేవలం మన ఆలోచనలతో మాత్రమే సహవాసం చేస్తూ తడిస్తే వచ్చేటంత మానసిక ఉల్లాసం ఎంత డబ్బు ఖర్చు చేసినాసరే దొరకదు. మనసు కలతచెందినప్పుడు మన హృదయగాయాన్ని గుర్తెరిగి మసలుకునే వ్యక్తులతో మాట్లాడినప్పుడు దొరికే సలహాల ముందు గొప్ప మానసిక నిపుణుడు డబ్బుకోసం ఇచ్చే సలహాలు తీసికట్టే. ఒంటరితనం మరియు ఏకాకి జీవితం ఒకటి కాదు అనే పరమసత్యం ఇవాళ బోధపడింది. మేఘాల ఘర్జనలో మండూకాల బెకబెకలలో హోరున కురుస్తూ ఘీంకారాలు తీసే వాన, గుండెల్లో ఉప్పొంగే ఎన్నో అగ్నిపర్వతాలను అణచివేస్తుంది, ఆహ్లాదాన్ని మళ్ళీ ఆనందించేలా చేస్తుంది. వర్షంతో ఎన్నో జీవితాలు ముడిపడివున్నాయి. ఆ మాటకొస్తే వర్షం లేకపోతే యేర్లు ఉంటాయా? సెలయేర్లు పారతాయా? మడిచేలు పండుతాయా? తిండిగింజలు దొరుకుతాయా? పర్జన్యభరిత వినీలాకాశంలో దుర్జన్యకుంజిత దాహార్తిని తీర్చే వారుణాశ్రిత ఇంద్రజాలికుడు దేశదేశాల సరిహద్దులు దాటేస్తూ, ఎల్లలు చెరిపేస్తూ, నదులను ఉరికిస్తూ, కాలాన్ని నడిపిస్తూ, సమయాన్ని నిలదీస్తూ, ప్రాణాన్ని నిలబెడుతున్నాడు. సశేషం... ----- * ప్రవహించే నీటికి "సరితా" అని పేరు.    శ్రీ మహావిష్ణు

తల్లిని మించిన దైవం లేదా?

పాఠశాలలో చేరగానే మొదట నేర్పే పంక్తి "తల్లిని మించిన దైవం లేదు" అని. అలాంటి ఒక తల్లి కథ -  ఆమె భర్త అనుకోని కారణాల చేత మరణించాడు పైగా అభంశుభం తెలియని మైనర్ బాలిక బాధ్యతలు పూర్తిగా ఆ తల్లి మీద పడ్డాయి. భర్త మరణించాడు, ఉన్న కష్టాలను ఈదడానికి చేదోడువాదోడుగా ఉండే మగమనిషి చనువును ఆశించింది ఆ తల్లి. ఆమె ఒక్కటే శారీరక సుఖాలు అనుభవిస్తే బాగోదు అనుకుందో ఏమో గానీ, ఆ సహచరుడితో (లివ్-ఇన్ రిలేషన్) తన మైనర్ కూతుర్ని కూడా అతని పక్కలో వేసింది.  ఆ సహచరుడు ఎప్పటినుండో అణచుకున్న ఆశను, కామతృష్ణను ఒకేసారి చూపలేకపోయాడు. అందుకే అనేకసార్లు ఆ మైనర్ బాలికను స్వర్గలోకాల అంచులకు తీసుకెళ్ళాడు. ఆ పాప తల్లికి ఆ స్వర్గలోకాలే కనిపించాయి తప్ప పంటిక్రింద అదుముకున్న ఆ పసిదాని కన్నీరు కనపడలేదు. ఫలితంగా ఆ పసిది మరొక పసివాడికి జన్మనిచ్చింది. కూతురిని సవితిగా మార్చుకున్న తల్లి, కూతురితో సమానమైన పిల్లతో కొడుకును కన్న తండ్రికాని తండ్రి, "ఎలాగూ పుట్టాడుగా, కళ్ళు మూసుకుని ఇదే కొనసాగిద్దాం" అనుకున్నట్లున్నారు పాపం.! పిల్లోడు పుట్టాక కూడా ఆ పసిదానికి శారీరక సుఖం (వేదన) తగ్గలేదు కదా ఇంకా హెచ్చయింది. మరొక రెండుసార

వెనకొచ్చిన కొమ్ములు!

అప్పుడప్పుడు - "హిందు నాగరికతకు కనీసం పదివేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇన్ని సంవత్సరాలుగా వర్ధిల్లుతూ వస్తుందంటే ఇదెంత గొప్పదో ఆలోచించండి. ఇలాంటి గొప్ప సంస్కృతి తప్పుడుదని నిన్నగాక మొన్నొచ్చిన ఎడారి మతాలు వంకలు పెడుతున్నాయి" అని కొందరు హిందువులు చేసే వ్యాఖ్యలు మనందరికీ సుపరిచితమే. ఫ్యాషన్ ఇండస్ట్రీలో - "కొత్తొక వింత, పాతొక రోత" అనే సామెత ఒకటుంది.  మన తెలుగులో - "వెనక మొలిచిన కొమ్ములొచ్చి ముందు పెరిగిన చెవుల్ని వెక్కిరించాయి" అనే సామెత కూడా ఉంది. పైరెండు సామెతలూ ఈ ఎడారి మతాలకు సరిగ్గా నప్పుతాయి. సరే, ఇదంతా వదిలేద్దాం! అసలు నిన్నగాక మొన్నొచ్చిన ఈ ఎడారి మతాలు చరిత్రను ఎలా చూస్తాయో చూద్దాం... క్రీస్తిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని క్రైస్తవులు "హీథేన్డోమ్" అంటారు. మహ్మదీయిజం ఆవిర్భావానికి ముందున్న కాలాన్ని మహ్మదీయులు "జాహిలియత్" అంటారు. అనగా - 'అనాగరికులైన హీనులైన గౌరవం ఇవ్వజాలని దౌర్భాగ్యులైన మూర్ఖ విగ్రహారాధకుల రాజ్యం' అని అర్థం.  దీనికి ప్రతిగా క్రైస్తవులు "క్రిస్టన్డోమ్"ను స్థాపించాలనీ, మహ్మదీయులు "దార్ ఉల్ ఇస్లాం

మానసికస్థితి | మరణం & గౌరవం

కొన్ని రోజుల క్రితం చైనీస్ వైరస్ వలన చనిపోయిన హిందువుల దహన కార్యక్రమాలను కొన్ని జాతీయ & అంతర్జాతీయ పత్రికల ముఠాలు చాలా నీచంగా ప్రదర్శించాయి. ఇవి చూసినంతసేపూ నాకు వారు పొందిన పైశాచిక ఆనందం కనిపించింది. నేను వ్యక్తిగతంగా చాలా చింతించాను. నాలో మొదలయ్యిన "మరణించిన వ్యక్తులకు మనం కనీస గౌరవం ఇవ్వలేని దౌర్భాగ్య సమాజంలో ఉన్నామా?" అనే భావోద్వేగం క్రమేణా ఈ వ్యాసంగా రూపుదిద్దుకుంది. భారతీయ సంస్కృతి మరియు హిందూ నాగరికత ప్రకారం మరణం అనేది, ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని వెతుక్కునే ప్రక్రియ. అలా వెతుక్కునే ఆత్మ యొక్క పూర్వపు జన్మకు సంబంధించిన అన్ని వస్తువులను దహనం చేయడం కొన్ని సాంప్రదాయాలకు మరియు జాతులకు ఎన్నో వేల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం, పరంపర. ఈ ఆచారానికి ఒక్కొక్కరూ ఒక్కొక్క భాష్యం చెబుతూ ఉంటారు, కొంతమంది దీనికి సైన్స్ ను కూడా జోడిస్తూ ఉంటారు, మరికొందరైతే ఈ ఆచారానికి ఎండు తాటాకులు కట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. నేను సైన్స్ కు దాని అర్హతకు మించిన ప్రాధాన్యం ఇవ్వను. కనుక, ఈ ఆచారం వెనుక ఉన్న తాత్వికతను మరియు బ్రతికి ఉన్న వారిగా చనిపోయిన వారి శరీరాలతో మనం వ్యవహరించాల్సిన కనీస

కథాకేళి 02 - అతనితో ఒక రాత్రి!

అతనితో ఒక రాత్రి.! జాబిలమ్మ వెలుగులో, చల్లగాలి హాయిలో, ఆరుబయట వనంలో, అద్దాలమేడ లాంటి ఊహల్లో అతనితో గడిపాను ఆ రాత్రి. అతని కళ్ళలో ఏదో తెలియని కొరత, ఎవరికోసమో ఆగని వెతుకులాట, ఎవరినో కలవాలనే ఆత్రుత, కంటికి కనిపించని అశ్రువులు నాకు కనిపించాయి. అతని ముఖంలో అంతులేని ఆవేదన ఏదో ఉంది, ఆప్యాయత తరగని భావం ఉంది, అనురాగం నిండిన అతని చూపులు నా మనసు పొరల్లో దాగున్న ప్రేయసిని తట్టిలేపాయి. అతని బాధను చూడలేకపోయాను. అతని కళ్ళలోకి ఆరాధనగా పరికించి చూశాను, అతన్ని కామించాను, కవ్వించాను, మనసుని రెచ్చగొట్టాను. చివరికి అతన్ని ఈలోకంలోకి తీసుకువచ్చాను. అతని చేతిని తీసుకుని నా భుజమూ స్థనమూ కలిసిన జంగమస్థానం పైన అదిమాను, అతని మరొక చేతిని నాభికీ పిరుదులకూ మధ్య ఉన్న నడుముపై ఆనించాను. ప్రాణం వచ్చినట్లు అతను చిరునవ్వు నవ్వాడు, ఏదో తెలియని వెలితితో... ఆ నవ్వులో ఎంతో ప్రేమ దాగుంది. అది ఎవరికోసమో నాకు తెలీదు కానీ నాకోసమైతే మాత్రం కాదు, అనే స్పృహ ఉంది నాకు. కానీ అతని నవ్వుల పాలసముద్రంలో నన్ను నేను మైమరచిపోయాను, అందులో ఓలలాడే కలువనవ్వాలని ఆశపడ్డాను. నాలో ప్రేమ కోరికలు అదుపుతప్పాయి, అతనికి నా కళ్ళతోనే సైగ చేశాను, నా మనసున ఉ

కథాకేళి 01 - బీటలువారిన గోడ

విక్రమశకం 2078, శ్రావణ శుక్లపక్షం ఎన్నో దశాబ్దాల నుండి రాజదుర్గాన్ని (కోటను) రక్షిస్తూ వస్తున్న బలిష్టమైన ప్రహరీగోడలో కాలానుగుణంగా కలిగే మార్పుల వలన చిన్నచిన్న పగుళ్ళు రావడం మొదలయ్యాయి. ఎక్కడినుండి వచ్చిందో తెలియదు, ఒక కాకి తన ముక్కుకు చిన్నపాటి విత్తనాన్ని ఒకదాన్ని గోడలో వచ్చిన పగుళ్ళలో విడిచింది. "ఏ చెట్టు విత్తనానివే నువ్వు, నా దగ్గరికి వచ్చావు? నేనెవరో తెలిసే ఇంత సాహసం చేశావా?" అని ఆ ప్రహరీగోడ విత్తనాన్ని గద్దించింది. దీనికి ఆ విత్తనం "ఇందులో నా తప్పు ఏమీలేదు, కాకి ఆహారం తినేసమయంలో దాని ముక్కుకి నన్ను కరుచుకుని, ఇక్కడ విడిచింది" అని సమాధానం ఇస్తూ, "ఇంతపెద్ద రాజదుర్గానికి రక్షణ కల్పిస్తున్నావు. పిసరంత కూడా లేను నేను, బయట నా ప్రయాణానికి భద్రతలేదు, నాకు కూడా ప్రాణహాని లేకుండా కాపాడవూ..." అంటూ ప్రాధేయపడింది. ఆలోచనలో పడ్డ ప్రహరీగోడ, "ఇంత చిన్న విత్తనం నన్నేమి చేస్తుందిలే, అయినా నా స్వలక్షణం ప్రకారం శరణు కొరినవారికి రక్షణ ఇవ్వడం నా విధి, కర్తవ్యం మరియు ధర్మం" అని తనలో తాను సమాధానం చెప్పుకొని, ఆ విత్తనానికి కొంత చోటిచ్చింది మన పరోపకారి ప్రహరీగోడ. రో