"నేను ఐఏఎస్ పాసయ్యి అక్షరజ్ఞానం లేని అవినీతి రాజకీయ నాయకులకు పర్సనల్ సెక్రెటరీగా పనిచెయ్యలేను" అన్నారు ఒక సందర్భంలో అన్నగారు మున్నూరు నాగరాజు గారు.
ఇవే ఆలోచనలు అన్నగారిలో ఇంకా అలానే ఉన్నాయో లేదో నాకు తెలియదు, కనుక కేవలం ఆలోచనల వరకే పరిమితమై ఈ విమర్శ ఉంటుంది. మావారిని నేను మరీ కటువుగా విమర్శ చెయ్యను, పరుషంగా మాట్లాడను. ఇది నాకు నేను పెట్టుకున్న నియమం. అన్నగారు దీన్నొక సద్విమర్శగా భావిస్తారని నాకు తెలుసు, ఆయన స్వభావం అలాంటిది మరి.
ఐఏఎస్ మీద నాకు అంతగా గౌరవం లేకపోయినా, నాకు ఈ వాక్యంపై పలురకాలైన అభ్యంతరాలున్నాయి.
మొదటిది - అక్షరజ్ఞానం లేనివారు అవినీతిపరులు.
రెండవది - రాజకీయ నాయకులకు అక్షరజ్ఞానం ఉండదు.
మూడవది - రాజకీయ నాయకులు అవినీతిపరులు.
ఆ అక్షరజ్ఞానం ఉన్నవారే అత్యంత పెద్దస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నట్లు, డబ్బుకు కక్కుర్తి పడుతున్నట్లు, లంచాన్ని వ్యవస్థీకరించడంలో సిద్ధహస్తుమైనట్లు ఈపాటికే తేటతెల్లం అయ్యింది. నమ్మకం లేకపోతే లాలూప్రసాద్ యాదవ్ చేసిన అవినీతిని మరియు ఏ రాజా చేసిన అవినీతిని పక్కపక్కన పెట్టుకుని చూడండి. ఇదొక ఉదాహరణ, అలాంటివి వెతికితే చాలానే కనపడతాయి. దీనిని బట్టి అవినీతి అనేది సాపేక్షమే తప్పితే సంపూర్ణమైనది కాదని తెలుస్తుంది.
మనల్ని నేడు బలితీసుకుంటున్న రాజ్యాంగం ఆ అక్షరజ్ఞానం కలిగిన రాజకీయ నాయకుల అర్ధవికసిత మనోనేత్రాల నుండి పుష్పించిన పుష్పమే! ఎంతైనా, అక్షరజ్ఞానం ఉన్నవారు చేసే అవినీతి అందంగా కనిపిస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ.
అవినీతిపరులుకాని రాజకీయ నాయకులు ఆకాశంలో నుండి ఊడిపడతారా? ప్రజాస్వామ్యం అనే ఈ రొచ్చులో నుండే కదా రావాల్సింది! మరి ఆ ప్రజలలో నీతిపరులెందరు? ఐదేళ్ళకు ఒక్కసారి ఓటు వెయ్యడం ప్రజాస్వామ్యమా? టమాటా కూడా కనీసం ఐదురోజులు నిల్వ ఉంటుంది, కనీసం ఒక్కరోజు కూడా నిల్వ ఉండలేని/ఉంచలేని ఆ ఓటుహక్కు సర్వకాల సర్వావస్థ సర్వరోగాలకూ నివారిణియా? అసలిందులో కొంచెమైనా నీతి అనేది కనిపిస్తుందా? ఇలాంటి వ్యవస్థ ద్వారా ఎన్నికోబడి వచ్చే నాయకులు నీతిపరులై ఉండాలని కాంక్షించడాన్ని ఏమనాలి?
రాజకీయ నాయకులను విమర్శించే ముందు ఆ సర్వోత్కృష్ట పదవులను వారికి కట్టబెట్టిన ఈ జనాన్ని అలా వదిలెయ్యడం నాకు నచ్చలేదు. ఇక్కడ నాగరాజు అన్నగారు మిత్రుడు అక్బర్ గారు చెప్పిన మాటలు గుర్తుచేసుకోవడం ముఖ్యం.
"నాగ, ఏ దునియా చుతియా హై, బస్ చుతియా బనానేవాలా చాహియే. న సంజే తు అనాడి హై" అనగా - "ఈ ప్రపంచంలోని జనాలు ఎర్రిపూకులు, వీళ్ళకి తమని ఎర్రిపూకుల్ని చేసేవారే కావాలి. ఇది అర్థం కాలేదంటే నువ్వు అమాయకుడివ"ని. ఇది పుస్తకంలో ఇచ్చిన అనువాదం కాదు, సంఘంలో సాధారణంగా వాడే ఉద్ధేశ్యంతో నేను అనువాదం చేసినది.
ఆ అక్షరజ్ఞానంలేనివారే చక్కని ఇళ్ళు కడుతున్నారు, మేలిమి బంగారం కొనుక్కుంటున్నారు. అక్షరజ్ఞానం ఉన్నవారు పేపర్ అస్సెట్స్ (కాగితపు ఆస్తులు) కొంటున్నారు. మోసం చెయ్యని సంఘం, అవినీతి జరగని రాజ్యం, అవివేకులు లేని సమాజం, క్రమశిక్షణ తప్పని విద్యార్థి ఉండడం అసహజం.
నాకు ఐఏఎస్ మీద కించిత్ గౌరవం లేకపోయినా రాజకీయం మీద అపారమైన గౌరవం ఉంది. శక్తికి హిందువులకు మిగిలిన ఆఖరి అస్త్రం అదొక్కటే మరి, దాన్ని కూడా నేను విడిచిపెట్టి తర్వాతి తరాలకు అన్యాయం చెయ్యలేను. అలానే ఎవరైనా దానిని అనకూడని మాట ఒకటన్నా నాకు నచ్చదు.
ఈ ఐఏఎస్ మీద నాకున్న ఏహ్యతకు కారణం లేకపోలేదు, 2013లో ఇంజనీరింగ్ అవ్వగానే వ్రాసిన రెండవ పరీక్ష అదే. నాకంటే తక్కువ మార్కులొచ్చిన కులాల అభ్యర్థులకు ముఖాముఖికి రమ్మని పిలుపొచ్చింది, నాకు మాత్రం మొండిచెయ్యి మిగిలింది. అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ ధోరణి మారాలని, నేనే దీన్ని మార్చాలని. కుదరకపోతే ఈ దేశం సరిహద్దులు వదిలిపోవాలని.
నిజ శ్రావణ శుక్ల పంచమి, 2080
నాగపంచమి
Comments
Post a Comment