హనుమ ధాటికి ఖిన్నుడై లంకానగర సచివులతో రావణుడు -
పురుషులలో మరియు వారి మంత్రాలోచనల్లో మూడు శ్రేణులు ఉంటాయి - ఉత్తమ, మధ్యమ మరియు అధమ.
ఉత్తమ పురుషుడు అనేవాడు తన హితాన్ని కోరేవాళ్ళను, సరైన ఆలోచనలు సమర్థంగా ఇచ్చే మంత్రులతోనూ, సుఖదుఃఖాలలో తోడుండే మిత్రులతోనూ, తన మేలును కోరుకునే బంధువర్గములతోనూ ఆలోచించి పనులను ఆరంభిస్తాడు, దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు.
మధ్యమ పురుషుడు తానొక్కడే కార్యనిర్వహణ గురించి ఆలోచించుకుని, ఆ విషయంలో మంచి చెడులు బేరీజు వేసుకుని, నిర్ణయం తీసుకుని, ఒంటరిగానే కార్యాచరణాన్ని మొదలుపెడతాడు. {కులాభివృద్దికి మతాభివృద్ధికి ఉన్నంతలో పాటుపడేవారు ఒంటరిగానే అన్నీ చేస్తుంటారు, వీరు మధ్యమ కోవలోకి వస్తారు!}
అధమ పురుషుడు గుణదోషాలను గురించి ఆలోచించకుండా, దైవాన్ని ఆశ్రయించకుండా (విస్మరించి), ఈ పనిని నేనొక్కడ్నే సాధించేస్తాను అనే ధీమాతో కార్యాన్ని ప్రారంభించి, ఆ పనిని పూర్తిచెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తాడు. {నాస్తికులు మరియు మనుషవాదులు (హ్యూమనిస్టులు), హేతువాదులు వగైరా అందరూ అధమ కోవలోకి వస్తారన్నమాట!} 🤣
ఇహ పురుషులు చేసే మంత్రాలోచనల దగ్గరికి;
మంత్రులందరూ (నేటి పరిస్థితులకు అనుగుణంగా, మనకు ఇంకా బాగా అర్థం కావడం కోసం, మతాన్ని, మతపెద్దలను, మేధావులను అనుకోవచ్చు) శాస్త్రీయదృష్టిని అనుసరించి ఏకాభిప్రాయానికి వచ్చిన ఆలోచన (మంత్రం) ఉత్తమశ్రేణికి చెందుతుంది. {ధనవంతులు, కుబేరులు & సంపన్నులు ఈ కోవలోకి వస్తారు. మనం వారిమధ్యనున్నది అనుకుంటున్న అపారమైన పోటీ మన కన్నులకు మాత్రమే, వారందరూ ఒకేలా ఆలోచిస్తారు. అందులో వాళ్ళలో వాళ్ళకి పోటీలేదు!}
ప్రారంభదశలో భేదాభిప్రాయాలు ఉన్నా తర్వాత కర్తవ్యాన్ని గుర్తించి ఒక నిర్ణయానికి వచ్చి చేసిన ఆలోచన (మంత్రం) మధ్యమశ్రేణికి చెందుతుంది. {క్రైస్తవ, మహ్మదీయ, వామపక్ష కూటములు ఈ కోవలోకి వస్తాయి. ఏ విధంగా హిందువులను బానిసలుగా ఉంచాలి అనే ఆలోచనలు మరియు ఆచరణలలో భేదాలు ఉన్నా వారంతా కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి అందుకు అనుగుణంగా నడుచుకోవడం ఈ శ్రేణిలో వారిని నిలబెడుతుంది.}
వేర్వేరు అభిప్రాయాలను కలిగి, తమ ఆలోచనలే (మంత్రాలే) శ్రేష్ఠమైనవని భావించుకుంటూ, కార్యసాధనకు ఎంతమాత్రం ఉపయోగపడని ఆలోచనలు చేస్తుంటారు. ఇవి అధమశ్రేణికి చెందుతాయి. {హిందువులు, అందలి కులాలు, దిశానిర్దేశం లేని ఐకమత్యం కోరుకునే సెక్యులర్లు, కులనిర్మూలన జరిగితే తప్ప సమానత్వం రాదని వాదించే మూఢులు, ఆడ-మగ ఫెమినిస్టులు, ఇలాంటి అందరూ ఎవరికివారే చేసే ఆచరణలేని ఆలోచనలు ఈ కోవలోకి వస్తాయి.}
చేతా వాతా చూస్తే తేలేది ఏంటంటే హిందువుల్లోనే అధములు ఎక్కువగా ఉన్నారు, వారికే అధమశ్రేణి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. 🫣
ఉపసహారం - నేడు మనం రాక్షసులు, దైత్యులు, దానవులు ఇలా అందరూ ఒక్కటే అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ వేర్వేరు జాతులు; కాకపోతే వీరందరికీ తండ్రి ఒక్కడే, కశ్యప ప్రజాపతి. అన్నట్లు అలాంటి ఒక ప్రజాపతి దక్షుడు, సతీదేవి అంతర్థానం తర్వాత దక్షుడు మేషముఖాన్ని ధరిస్తాడు, అలా ప్రజాపతి అజముఖుడు అయ్యాడు. ఈ అజముఖం మనకు క్రైస్తవం రావడానికి పూర్వం ఉన్న అన్ని మతాల్లోనూ కనిపిస్తుంది. ఒక ఉదాహరణ - బాల్ లేదా బా'అల్ (తెలుగు బైబిల్లో ఈయనను "బయలు దేవుడు" అంటారు). అలానే క్రైస్తవంలో కూడా కనిపిస్తుంది, ఉదాహరణ - "నైట్స్ టెంప్లార్స్" అనే క్రైస్తవ యుద్ధ తెగ బాఫోమెత్ అనేటువంటి అజముఖ దేవుడ్ని ఆరాధన చేసేవారు. ఇలాంటి అజముఖం కలిగిన దేవతలు ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తూనే ఉంటారు. అంతెందుకు అశ్వినీ దేవతలను కూడా అజముఖులు (గుఱ్ఱం ముఖాలు) అంటారు, హయగ్రీవుడ్ని కూడా అజముఖుడు (గుఱ్ఱం ముఖం) అంటారు. ఈ అజముఖమే (మేష ముఖం) ఇహనుండి నా వంశపతాకంపై ఉండబోతోంది, ఇది ప్రజాపతికి సంకేతం.
నిజ శ్రావణ బహుళ తదియ 2080
Comments
Post a Comment